Sunday, May 11, 2008

నా మంచం..

కొత్తగా చేరిన సన్యాసిని మఠాధిపతి దగ్గరకు

కంగారుగా వచ్చి చెప్పింది..

"ఆచార్యులవారూ,నా బకెట్

పగిలిపోయిందండి!ఇప్పుడేం చేయాలి?"

వారు ప్రశాంతంగా జవాబిచ్చారు:

"మాతా!..ఈ మఠంలో నా అనే వస్తువేదీ ఉండదు.

అన్నీ మన వస్తువులే.నా అని అనకూడదు.

నెల రోజుల తరువాత మళ్ళీ ఆమె ఆయన

దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది..

"నా చీపురు అరిగి పోయిందండి.

కొత్త చీపురు కావాలి".

మఠాధిపతి ఇలా చెప్పారు:

అలా అనకూడదని ఇంతకు ముందే చెప్పా కదా.

ఈ మఠం లో నా అనే వస్తువేదీ వుండదు.

అన్నీ మన వస్తువులే.కాబట్టి,

ఆ చీపురు మన అందరిదీ."

ఒకరోజు మఠాధిపతి గారు ఆయన భక్తుల

ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు..

ఆమె మళ్ళీ వచ్చింది.

"ఆచార్యుల వారూ..మన మంచం విరిగి పోయిందండీ.

వెంటనే బాగు చేయించాలండీ, లేకపోతే..

మనకి కష్టం!!!. అని చెప్పింది.....

*(మల్లిక్ చిలిపి నుంచి సంగ్రహించింది)

No comments: